అలనాటి నటి గీత కపూర్ ఇకలేరు..
- May 26, 2018అలనాటి బాలీవుడ్ నటి గీతా కపూర్(57) వృద్ధాశ్రమంలో శనివారం కన్నుమూశారు. అయిన వాళ్ళ ఆదరణకు నోచుకోని గీత కపూర్ ఏళ్ల తరబడి వృద్ధాశ్రమంలో గడిపారు.దాదాపు 50 చిత్రాల్లో నటించిన ఆమె చివరివరకు కొడుకు కూతురి జాడకోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ మధ్యలోనే వారిని చూడకుండా మరణించిందని ఆమె అభిమాని అశోక్ పండిట్ వెల్లడించాడు. గీతా కపూర్ కు కొడుకు, కూతురు ఉన్నారని వారు ఆమెను ఆదరించలేదని కొడుకు గీతా కపూర్ ను చిత్రహింసలకు గురిచేసి నాలుగురోజులకు ఒకసారి అన్నం పెట్టేవాడని దాంతో ఆమె అనారోగ్యం పాలైంది.ఆ సమయంలో ఆమెను ఆసుపత్రిలోనే వదిలేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆమె పరిస్థితి తెలుసుకున్న తాను ఆసుపత్రి బిల్లులు కట్టి గీతా కపూర్ ను వృద్ధాశ్రమంలో చేర్పించానని అశోక్ పండిట్ అన్నారు.కానీ వృద్ధాశ్రమంలో ఉన్నంతకాలం కొడుకు కూతురుకోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిందని కానీ వారు రాలేదని తీవ్రంగా దుఃక్కించేదని... ఈ క్రమంలో ఆరోగ్యాన్ని పాడుచేసుకుని కన్నుమూశారని అన్నారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆస్పత్రిలో ఉంచాం. ఆమె తరుపువారు ఎవరైనా వస్తారేమో రెండు రోజులపాటు ఎదురుచూస్తాం. రానిపక్షంలో మేమే అంత్యక్రియలు జరిపిస్తాం’ అని అశోక్ పండిట్ తెలిపారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన