విశాఖపట్నం-కౌలాలంపూర్ 3,399కే టికెట్
- July 11, 2018న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల కోసం మలేషియాకు చెందిన ఎయిర్ఏషియా విమానయాన సంస్థ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా తగ్గింపు ధరల్లో 30 లక్షల సీట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు ఎయిర్ఏషియా ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖపట్నం-కౌలాలంపూర్ టికెట్ ధర రూ.3,399గా, కొచ్చి-కౌలాలంపూర్ టికెట్ ధర రూ.3,699గా ఉంటుందని పేర్కొంది. సోమవారం ప్రారంభమైన ఈ ఆఫర్ వారం రోజులు ఉంటుందని, ఈ ఆఫర్లో టికెట్లు బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి వ చ్చే ఏడాది మే 31 వరకు ఎప్పుడైన ప్రయాణించవచ్చని తెలిపింది.
కోల్కతా-కౌలాలంపూర్, బెంగుళూరు-కౌలాలంపూర్ టికెట్ ధర రూ.6,999గా, తిరుచ్చి-హైదరాబాద్ టికెట్ ధర రూ.4,699గా ఉంటుందని పేర్కొంది. అలాగే బెంగుళూరు-కొచ్చి, బెంగుళూరు-గోవా, బెంగుళూరు-జైపూర్, బెంగుళూరు-చండీగఢ్ వంటి దేశీ విమాన టికెట్ ధరలు వరుసగా రూ.1,390,రూ.1,690, రూ.3,290, రూ.3,490గా ఉంటాయని ఎయిర్ఏషియా ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిట్టు చాండిల ్య తెలిపారు.
తాజా వార్తలు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు