40 రోజులు లాక్ అయిన ప్రభాస్
- July 15, 2018బాహుబలి చిత్రం తో దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం 'రన్ రాజా రన్' ఫెమ్ సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రం లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా , బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. గత నెల క్రితం దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ , మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.
ఈ షెడ్యూల్ దాదాపు 40 రోజుల పాటు జరుగనుంది. సినిమాలోని కీలక సన్నివేశాలను ఇక్కడ షూట్ చేస్తారని సమాచారం. తెలుగు , తమిళ , హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్ -లాయ్ లు సంగీతం అందిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!