'పనస ఎంటర్‌ప్రైజెస్‌' ద్వారా తెలంగాణలో గోవా కింగ్‌ బీర్‌

- July 17, 2018 , by Maagulf
'పనస ఎంటర్‌ప్రైజెస్‌' ద్వారా తెలంగాణలో గోవా కింగ్‌ బీర్‌

హైదరాబాద్:సినీ పరిశ్రమతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన రవికుమార్‌ పనస, బెవరేజెస్‌ బిజినెస్‌లో ప్రతిష్టాత్మకమైన విజయం దిశగా ముందడుగు వేశారు. గోవా కింగ్‌ బీర్‌, ఎంత పాపులరో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ బీర్‌ని తెలంగాణలో పనస ఎంటర్‌ప్రైజెస్‌ డిస్ట్రిబ్యూషన్‌ చేయనుంది. ఈ అవకాశం తనకు ఇచ్చినందుకుగాను గోవా కింగ్‌ బీర్‌ అధినేత, సినీ నటుడు, బడా పారిశ్రామికవేత్త సచిన్‌ జోషీకి కృతజ్ఞతలు తెలిపారు రవికుమార్‌ పనస. సచిన్‌ జోషితో తన అనుబంధం గురించి చెబుతూ, ఆయన తనకు గ్రేట్‌ మెంటార్‌ అనీ, బెస్ట్‌ సపోర్టర్‌ అలాగే గురు అని రవికుమార్‌ పనస చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com