15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ

- April 27, 2024 , by Maagulf
15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ

రియాద్: రియాద్‌లో అనేక ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు అవుతున్నట్లు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ మహమ్మద్ అల్-అబ్దాలీ తెలిపారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని ప్రామాణిక ఫుడ్ కోర్టులలో మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. 15  సంఘటనలు ఒకే ఫుడ్ కోర్టులో గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దానిపై చర్యలు తీసుకున్నామని ఆ ఫుడ్ కోర్ట్ ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. బాధిత వ్యక్తులు అవసరమైన వైద్య సంరక్షణను పొందారని,  పరిస్థితిని మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com