10 దిర్హామ్లకే టిక్కెట్: దుబాయ్ ఎయిర్లైన్
- July 19, 2018దుబాయ్కి చెందిన ఎయిర్ లైన్ ఫ్లై దుబాయ్, సమ్మర్ నేపథ్యంలో స్పెషల్ ఫేర్స్ని అనౌన్స్ చేసింది. దుబాయ్ నుంచి వెళ్ళేందుకుగాను కనిష్టంగా 10 దిర్హామ్ల ఖర్చుతో టిక్కెట్లను ప్రకటించింది. అయితే ఈ అతి తక్కువ ధర పిల్లలకు మాత్రమే. జులై 19 నుంచి జులై 28 వరకు ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది. ఈ సమయంలో టిక్కెట్ కొనుగోలు చేసినవారికి ఆగస్ట్ 15 వరకు ప్రయాణించే వీలుంటుంది. జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్ ఇటలీ తదిత డెస్టినేషన్స్ ఇందులో వున్నాయి. జోర్డాన్, ఇరాక్, జాంజిబార్ కూడా ఈ లిస్ట్లో వున్నాయి. ఈ ఆఫర్ పొందాలంటే అడల్ట్ రిటర్న్ టిక్కెట్ని ఎకానమీలో కొనుగోలు చేయాల్సి వుంటుంది. అడల్ట్ ఫుల్ ఫేర్ చెల్లించాక, చిన్నారులకు 10 దిర్హామ్లకే టిక్కెట్ని పొందవచ్చు. పన్నులు, సర్ఛార్జిలు దీనికి అదనం. పిల్లలు 3 నుంచి 12 ఏళ్ళ వయసువారైతేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దుబాయ్ నుంచి ఎకానమీ క్లాస్ ఫేర్స్కి మాత్రమే ఈ ఆఫర్ పరిమితం.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు