దుబాయ్లో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
- September 17, 2018దుబాయ్లోని షేక్ రషీద్ రోడ్డుపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురికి గాయలయ్యాయి. వాహనం టైరు పేలి, బ్యారియర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతి చెందినవారిలో ఓ మహిళ, ఓ పురుషుడు వున్నారు. గాయపడ్డవారిలో ఐదుగురు మహిళ కాగా, ఒకరు పురుషుడు. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఉదయం 9.32 నిమిషాల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడ్డవారికి రషీద్ హాస్పిటల్లో వైద్య చికిత్స అందుతోందని అల్ మురాకాబాద్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అలి అహ్మద్ అబ్దుల్లా ఘానిమ్ చెప్పారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ని పాటించడంతోపాటు, రెగ్యులర్గా తమ వాహనాన్ని చెక్ చేస్తుండాలనీ, టైర్ల విషయంలో అప్రమత్తంగా వుండాలని బ్రిగేడియర్ ఘానిమ్ సూచించారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు