లాంగ్ టెర్మ్ రెసిడెన్స్ వీసాపై హర్షం
- September 17, 2018
యూఏఈలోని వలసదారులు, రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ కాలం యూఏఈలో వుండేందుకు వీలుగా యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చేసిన ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఐదేళ్ళ రెసిడెన్స్ వీసాకి సంబంధించి నిబంధనలు ఇలా వున్నాయి. 55 ఏళ్ళకు పైబడ్డవారికి ఐదేళ్ళకుగాను ప్రత్యేక పరిస్థితుల్లో వీసాని మంజూరు చేస్తారు. వలసదారుడు ఖచ్చితంగా 2 మిలియన్ దిర్హామ్ల విలువైన ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ కలిగి వుండాలి. 1 మిలియన్ లేదా అంతకు మించి సేవింగ్స్ వుండాలి. 20,000 దిర్హామ్ల కంటే ఎక్కువగా యాక్టివ్ ఆదాయం కలిగి వుండాలి. ఈ మూడింటిలో ఏది కలిగి వున్నా, వారికి ఐదేళ్ళ కాలానికి రెసిడెన్సీ వీసా దక్కుతుంది. దశాబ్దాలుగా యూఏఈలో నివసిస్తున్నవారికి ఇది ఎంతో ఉపకరిస్తుందని రాయల్ ఆర్కిడ్ గ్రూప్ ఓనర్ వినయ్ వర్మ చెప్పారు. 17 ఏళ్ళుగా తాను యూఏఈలో నివసిస్తున్నాననీ, తమకు ఈ నిర్ణయం ఎంతో ఆనందాన్నిచ్చిందని లైన్ ఇన్వెస్టిమెంట్ డైరెక్టర్, లులు గ్రూప్ ఎక్స్ప్రెసెస్ వజీబ్ అల్ ఖౌరి చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి