లాంగ్ టెర్మ్ రెసిడెన్స్ వీసాపై హర్షం
- September 17, 2018యూఏఈలోని వలసదారులు, రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ కాలం యూఏఈలో వుండేందుకు వీలుగా యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చేసిన ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఐదేళ్ళ రెసిడెన్స్ వీసాకి సంబంధించి నిబంధనలు ఇలా వున్నాయి. 55 ఏళ్ళకు పైబడ్డవారికి ఐదేళ్ళకుగాను ప్రత్యేక పరిస్థితుల్లో వీసాని మంజూరు చేస్తారు. వలసదారుడు ఖచ్చితంగా 2 మిలియన్ దిర్హామ్ల విలువైన ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ కలిగి వుండాలి. 1 మిలియన్ లేదా అంతకు మించి సేవింగ్స్ వుండాలి. 20,000 దిర్హామ్ల కంటే ఎక్కువగా యాక్టివ్ ఆదాయం కలిగి వుండాలి. ఈ మూడింటిలో ఏది కలిగి వున్నా, వారికి ఐదేళ్ళ కాలానికి రెసిడెన్సీ వీసా దక్కుతుంది. దశాబ్దాలుగా యూఏఈలో నివసిస్తున్నవారికి ఇది ఎంతో ఉపకరిస్తుందని రాయల్ ఆర్కిడ్ గ్రూప్ ఓనర్ వినయ్ వర్మ చెప్పారు. 17 ఏళ్ళుగా తాను యూఏఈలో నివసిస్తున్నాననీ, తమకు ఈ నిర్ణయం ఎంతో ఆనందాన్నిచ్చిందని లైన్ ఇన్వెస్టిమెంట్ డైరెక్టర్, లులు గ్రూప్ ఎక్స్ప్రెసెస్ వజీబ్ అల్ ఖౌరి చెప్పారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక