ప్రముఖ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత

- October 20, 2018 , by Maagulf
ప్రముఖ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత

నటుడు వైజాగ్ ప్రసాద్(75) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ఆదివారం ఉదయం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు. వైజాగ్ ప్రసాద్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. వైజాగ్ ప్రసాద్ దాదాపు 170కి పైగా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. 1983 లో వచ్చిన బాబాయ్ అబ్బాయ్ నటుడిగా ఆయన మొదటి సినిమా. తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాలో కథానాయకుడి తండ్రిగా నటించి పలు ఆఫర్స్ పొందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com