మహేష్ హీరోయిన్ ని పరామర్శించిన నమ్రత
- November 01, 2018బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే తెలుగులో మహేష్ బాబు సరసన మురారీ సినిమాలో నటించింది. ఆ అభిమానంతోనే క్యాన్సర్తో పోరాడుతూ న్యూయార్క్లో చికిత్స పొందుతున్న సోనాలీని చూడడానికి మహేష్ బాబు భార్య నమ్రత వెళ్లింది. వివాహం చేసుకున్న తరువాత సిల్వర్ స్క్రీన్కు దూరమైన సోనాలీకి ఒక బాబు ఉన్నాడు. గత కొంత కాలంగా హైగ్రేడ్ క్యాన్సర్ బాధపడుతోంది. ఈ విషయాన్ని సోనాలీ జులైలో తనే స్వయంగా ప్రకటించింది.
అప్పటి నుంచి చికిత్స తీసుకుంటోంది. చికిత్సలో భాగంగా కీమో థెరపీ చేయించుకుంటున్న సమయంలో జుట్టంతా రాలిపోతుంది. గుండుతో ఉండాల్సి వచ్చినా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా దాన్ని కూడా సంతోషంగానే స్వీకరించింది. ధైర్యంగా ఉన్నానంటూ అభిమానులకోసం ఆ ఫోటోలను షేర్ చేసింది. ఇప్పటికే ఆమెను బాలీవుడ్ సెలబ్రెటీలు చాలామంది పలకరించారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా సోనాలీని కలిసి వచ్చారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. సోనాలి గురిచి చెబుతూ.. తనకి ధైర్యం చాలా ఎక్కువని, క్యాన్సర్ బారి నుంచి కోలుకుంటోందని అన్నారు.
త్వరలో సాధారణ జీవితం గడపనుంది అని నమ్రత తెలిపింది. ఆమెతో గడిపిన కొద్ది సమయం చాలా సంతోషంగా అనిపించిందని, చాలా విషయాలు చర్చించుకున్నామని వివరించింది. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తానని తెలిపింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు