అంతరిక్షంలోకి మరో యూఏఈ శాటిలైట్!
- November 07, 2018మైశాట్-1 పేరుతో యూఏఈకి చెందిన స్టూడెంట్స్ తయారు చేసిన నానో శాటిలైట్ ఈ నెలలోనే అంతరిక్షంలోకి వెళ్ళనుంది. గత నెలలో అంటే అక్టోబర్లో 29వ తేదీన దేశానికి చెందిన ఖలీఫా శాటిలైట్, జపాన్లోని ప్రయోగ కేంద్రం నుంచి ఆకాంశంలోకి దూసుకెళ్ళిన సంగతి తెల్సిందే. కాగా, 20 మంది విద్యార్థులు, మైశాట్-1 శాటిలైట్ని రూపొందించారు. ఖలీఫా యూనివర్సిటీకి చెందిన ఈ విద్యార్థులు తయారు చేసిన శాటిలైట్, భూమిని ఫొటోలు తీయనుంది. ప్రధానంగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం దీన్ని రూపొందించారు. నార్త్ట్రాప్ గ్రుమ్నాన్ సంస్థ తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్ ద్వారా మైశాట్-1 ఉపగ్రహాన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపిస్తారు. మైశాట్-1 బరువు 1.3 కిలోలు. మస్దార్ సిటీలోని యహ్శాట్ స్పేస్ ల్యాబ్లో దీన్ని రూపొందించారు. మస్దార్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసిన బ్యాటరీతోపాటు, కెమెరా ఇందులోని ప్రధాన భాగాలు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన