అంతరిక్షంలోకి మరో యూఏఈ శాటిలైట్!
- November 07, 2018మైశాట్-1 పేరుతో యూఏఈకి చెందిన స్టూడెంట్స్ తయారు చేసిన నానో శాటిలైట్ ఈ నెలలోనే అంతరిక్షంలోకి వెళ్ళనుంది. గత నెలలో అంటే అక్టోబర్లో 29వ తేదీన దేశానికి చెందిన ఖలీఫా శాటిలైట్, జపాన్లోని ప్రయోగ కేంద్రం నుంచి ఆకాంశంలోకి దూసుకెళ్ళిన సంగతి తెల్సిందే. కాగా, 20 మంది విద్యార్థులు, మైశాట్-1 శాటిలైట్ని రూపొందించారు. ఖలీఫా యూనివర్సిటీకి చెందిన ఈ విద్యార్థులు తయారు చేసిన శాటిలైట్, భూమిని ఫొటోలు తీయనుంది. ప్రధానంగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం దీన్ని రూపొందించారు. నార్త్ట్రాప్ గ్రుమ్నాన్ సంస్థ తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్ ద్వారా మైశాట్-1 ఉపగ్రహాన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపిస్తారు. మైశాట్-1 బరువు 1.3 కిలోలు. మస్దార్ సిటీలోని యహ్శాట్ స్పేస్ ల్యాబ్లో దీన్ని రూపొందించారు. మస్దార్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసిన బ్యాటరీతోపాటు, కెమెరా ఇందులోని ప్రధాన భాగాలు.
తాజా వార్తలు
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం. ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!