CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?

- May 16, 2024 , by Maagulf
CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?

యూఏఈ: ఈ ఏడాది చివర్లో 9 నుండి 12 తరగతుల విద్యార్థులకు ఓపెన్ బుక్ పరీక్షలను అమలు చెయ్యాలన్నా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎగ్జామినేషన్ (CBSE) నిర్ణయాన్ని యూఏఈలోని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. అయినప్పటికీ, కొంతమంది ప్రధానోపాధ్యాయులు పాఠశాలలు స్వతంత్రంగా విద్యార్థుల పరీక్షలలో ఓపెన్ బుక్ విధానాన్ని ప్రవేశపెట్టాయని చెప్పారు, అయితే దాని ప్రభావం కొంతవరకు పరిమితం చేయబడింది.

"మేము విద్యార్థుల అసైన్‌మెంట్‌లలో ఓపెన్ బుక్ కాన్సెప్ట్‌ను ప్రారంభించాము.  అది కొంత వరకు బాగా పనిచేసింది." విద్యార్థులు నిర్దిష్ట అధ్యాయాలు లేదా అంశాలను చదవడానికి బదులు మొత్తం పుస్తకాన్ని చదివి కంటెంట్‌ను అర్థం చేసుకునేలా చూడడమే లక్ష్యమని కొట్టక్కుళం వివరించారు. అబుదాబిలోని కొన్ని పాఠశాలల్లో కూడా, ఇంటర్నెట్‌లో మార్గదర్శక వనరులను సెర్చ్ చేయడం ద్వారా ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడానికి ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్‌లను నిర్వహిస్తున్నారనీ అబుదాబిలోని GEMS యునైటెడ్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్/CEO K జార్జ్ మాథ్యూ తెలిపారు. BYOD (మీ స్వంత పరికరాన్ని తీసుకురండి) తరగతిలో ఇటువంటి పరిశోధన ప్రాజెక్ట్‌లను విద్యార్థులకు అందించడంలో సహాయపడుతుందని, ఈ పద్ధతి ఓపెన్-బుక్ మోడల్‌తో సమానంగా ఉంటుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com