అగ్ని ప్రమాదం: ఇద్దరి మృతి, ముగ్గురికి గాయాలు
- November 12, 2018షార్జాలోని ఓ విల్లాలో జరిగిన అగ్ని ప్రమాదం ఇద్దర్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. షార్జా మే సెలూన్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే షార్జా సివిల్ డిఫెన్స్, సంఘటనా స్థలానికి ఫైర్ ఫైటర్స్నీ, రెస్క్యూ యూనిట్స్నీ పంపించడం జరిగింది. కేవలం ఐదు నిమిషాల్లోనూ సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడ్డ ఆసియా మహిళ, ఆమె చిన్నారికి వెంటనే వైద్య సహాయం అందించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా వుంది. సమాన్ అలాగే అల్ మినా నుంచి కూడా ఫైర్ ఫైటర్స్, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన ఇంట్లో 30 మంది వరకు నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం