ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- May 18, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి లండన్ పర్యటనకు వెళ్లారు. సీఎం జగన్ లండన్ కు వెళ్లే సమయంలో గన్నవరం విమానాశ్రయంలో కలకలం రేగింది. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని అమెరికాలోని వాషింగ్టన్ లో నివాసం ఉంటున్న డాక్టర్ తుళ్లూరు లోకేశ్ గా పోలీసులు గుర్తించారు. అతడికి అమెరికన్ పౌరసత్వం ఉన్నట్టు తెలిసింది.
కాగా, సీఎం జగన్ విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా లోకేశ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు సమాచారం. దీని గురించి పోలీసులు అతడిని ప్రశ్నించారు. జగన్ విదేశాలకు వెళ్లే సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నావని అడగ్గా తనకు గుండెపోటు వచ్చిందని కుప్పకూలిపోయాడు. దీంతో పోలీసులు అతడిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్ తుళ్లూరు లోకేశ్ వ్యవహారం పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







