ప్రత్యేక దేశం కావాలంటున్న అఫ్రిది
- November 14, 2018మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది తన నోటికి పనిచెప్పాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయినా ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటాడు. తాజాగా అఫ్రీది చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ కార్యక్రమాన్ని పురస్కరించుకొని బ్రిటిష్ పార్లమెంట్ లో విద్యార్ధులతో ముచ్చటించిన అఫ్రీది..కశ్మీర్ ను వదిలేయండి. నాలుగు ప్రావిన్స్ లనే సరిగా చూసుకోలేని మీకు కశ్మీర్ ఎందుకు. ఉన్న దేశంలో శాంతిభద్రతల్ని కాపాడాలంటూ పాక్ ప్రభుత్వానికి హితువు పలికాడు.
అంతేకాదు కశ్మీర్ను ఇండియాకు కూడా ఇవ్వొద్దని, లోయలో ప్రజలు చనిపోవడం తనను ఎంతగానో బాధిస్తోందని అఫ్రిది అన్నాడు. పాకిస్థాన్కు కశ్మీర్ అవసరం లేదు. అలాగని ఇండియాకు కూడా దానిని ఇవ్వొద్దు. కశ్మీర్ ప్రత్యేక దేశం కావాలి. అఫ్రీది చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. పలువురు నెటిజన్లు అతనిపై విమర్శలు కురిపిస్తున్నారు. సొంత దేశంపై విమర్శలు చేస్తున్న అఫ్రీది ఇలా మాట్లాడే అర్హత లేదని అంటున్నారు నెటిజన్లు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు