మాలధారణలో శర్వానంద్.. ఎంతో నిష్టగా పడిపూజ
- November 28, 2018కార్తీక మాసం ఎంతో పవిత్రం. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఈనెలలోనే అయ్యప్పమాల వేసుకుని స్వాములు భజనలు చేస్తుంటారు. మాల వేసుకున్న స్వాముల ఇళ్లు కూడా దేవాలయాలను తలపిస్తుంటాయి. ఇంట్లోని వారు కూడా ఎంతోనిష్టగా, భక్తి శ్రద్ధలతో స్వాములకు ప్రసాదాలు వండి పెడుతుంటారు.
వారు కూడా భగవన్నామస్మరణలో పునీతులవుతుంటారు. వృత్తిలో భాగంగా షూటింగులతో బిజీగా ఉన్నా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు అయ్యప్పమాల వేసుకుని శ్రద్ధాభక్తులతో అయ్యప్పని పూజిస్తుంటారు. ఈసారి కూడా హీరోలు రాంచరణ్, శర్వానంద్లు మాల వేసుకున్నారు.
ప్రతి సంవత్సరం మాల వేసుకుని 41 రోజులు దీక్ష తీసుకుని శబరిమల వెళ్లి అయ్యప్పని దర్శించి వస్తుంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో ఉన్న దైవ సన్నిధిలో శర్వానంద్ మహాపడి పూజ నిర్వహించారు. అయ్యప్పస్వామికి
పూజలు చేశారు. ఈ మహాపడిపూజలో పలువురు స్వాములు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో పూజాదిక కార్యక్రమాలు నిర్వహించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్