జనవరి లో సందడి చేయనున్న Mr.మజ్ను
- November 28, 2018అక్కినేని అఖిల్ , నిధి అగర్వాల్ జంటగా తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మిస్టర్ మజ్ను'. అఖిల్ , హలో చిత్రాలతో ప్లాప్స్ అందుకున్న అఖిల్ ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఎలాగైనా ఈ సినిమా అభిమానులను అలరిస్తుందని గట్టిగా చెపుతున్నాడు. ఇక ఇటీవల విడుదలైన టీజర్ సైతం కొత్తగా , ఆసక్తిగా ఉండడం తో అభిమానులు సైతం ఈ సినిమా ఫై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చిత్ర యూనిట్ భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడం తో సినిమాను జనవరి నెలలో విడుదల చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుందని , సినిమా టాకీ పార్ట్ మొత్తం ముగిసిందని, ఇంకొక్క సాంగ్ మిగిలుందని చిత్ర మేకర్స్ చెపుతున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్