జనవరి లో సందడి చేయనున్న Mr.మజ్ను
- November 28, 2018
అక్కినేని అఖిల్ , నిధి అగర్వాల్ జంటగా తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మిస్టర్ మజ్ను'. అఖిల్ , హలో చిత్రాలతో ప్లాప్స్ అందుకున్న అఖిల్ ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఎలాగైనా ఈ సినిమా అభిమానులను అలరిస్తుందని గట్టిగా చెపుతున్నాడు. ఇక ఇటీవల విడుదలైన టీజర్ సైతం కొత్తగా , ఆసక్తిగా ఉండడం తో అభిమానులు సైతం ఈ సినిమా ఫై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చిత్ర యూనిట్ భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడం తో సినిమాను జనవరి నెలలో విడుదల చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుందని , సినిమా టాకీ పార్ట్ మొత్తం ముగిసిందని, ఇంకొక్క సాంగ్ మిగిలుందని చిత్ర మేకర్స్ చెపుతున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







