జనవరి లో సందడి చేయనున్న Mr.మజ్ను

- November 28, 2018 , by Maagulf
జనవరి లో సందడి చేయనున్న Mr.మజ్ను

అక్కినేని అఖిల్ , నిధి అగర్వాల్ జంటగా తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మిస్టర్ మజ్ను'. అఖిల్ , హలో చిత్రాలతో ప్లాప్స్ అందుకున్న అఖిల్ ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఎలాగైనా ఈ సినిమా అభిమానులను అలరిస్తుందని గట్టిగా చెపుతున్నాడు. ఇక ఇటీవల విడుదలైన టీజర్ సైతం కొత్తగా , ఆసక్తిగా ఉండడం తో అభిమానులు సైతం ఈ సినిమా ఫై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చిత్ర యూనిట్ భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడం తో సినిమాను జనవరి నెలలో విడుదల చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుందని , సినిమా టాకీ పార్ట్ మొత్తం ముగిసిందని, ఇంకొక్క సాంగ్ మిగిలుందని చిత్ర మేకర్స్ చెపుతున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com