జనవరి లో సందడి చేయనున్న Mr.మజ్ను
- November 28, 2018
అక్కినేని అఖిల్ , నిధి అగర్వాల్ జంటగా తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మిస్టర్ మజ్ను'. అఖిల్ , హలో చిత్రాలతో ప్లాప్స్ అందుకున్న అఖిల్ ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఎలాగైనా ఈ సినిమా అభిమానులను అలరిస్తుందని గట్టిగా చెపుతున్నాడు. ఇక ఇటీవల విడుదలైన టీజర్ సైతం కొత్తగా , ఆసక్తిగా ఉండడం తో అభిమానులు సైతం ఈ సినిమా ఫై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చిత్ర యూనిట్ భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడం తో సినిమాను జనవరి నెలలో విడుదల చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుందని , సినిమా టాకీ పార్ట్ మొత్తం ముగిసిందని, ఇంకొక్క సాంగ్ మిగిలుందని చిత్ర మేకర్స్ చెపుతున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







