హైదరాబాద్:మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్కు ఒకే కార్డు...
- December 18, 2018హైదరాబాద్ జంట నగరాల వాసులకు ఇది ముమ్మాటికీ శుభవార్తే... త్వరలోనే మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించాలంటే ఒక కార్డు తీసుకుంటే సరిపోతుంది. 'మెట్రో కామన్ మోబిలిటీ కార్డ్' పేరుతో ఇది త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిపై వారం రోజుల్లో విధివిధానాలు ఖరారు చేయనున్నారు. టీఆర్ అండ్ బీ ప్రధాన కార్యదర్శి సుశీల్ శర్మ, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి... బేగంపేట్లోని హెచ్ఎంఆర్ఎల్ కార్యాలయంలో కామన్ మోబిలిటీ కార్డ్ అమలుపై సమీక్షించారు. ఎస్బీఐ/ హిటాచీ కన్సార్టియం ద్వారా సీఎంసీ అండ్ టీ మెట్రో సీఎంసీ కార్డును అమలు చేయడానికి హోదాను ఇచ్చారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి, 2019 జనవరి చివరికి కనీసం రెండు మెట్రో స్టేషన్లలో, 100 ఆర్టీసీ బస్సుల్లో, 50 ఆటోస్ మెట్రో క్యాంపెన్షన్ ప్రాంతాల ద్వారా పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సూచించారు. ఈ ప్రాజెక్టు పురోగతిని ప్రిన్సిపాల్ సెక్రటరీ టీఆర్ అండ్ బీ, ఎంఎండీ, హెచ్ఎమ్ఆర్ఎల్ పర్యవేక్షిస్తారు. ఇది సక్సెస్ అయితే... జంట నగరాల పరిధిలో త్వరలోనే 'మెట్రో కామన్ మోబిలిటీ కార్డ్' అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం