సినీ దిగ్గజాలపై ఐటీ దాడులు..జీర్ణించుకోలేని ఫ్యాన్స్
- January 03, 2019లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కర్ణాటకలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి... ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సినీ దిగ్గజాల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ నివాసంతో పాటు... ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య అయిన సినీనటి రాధిక నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హీరో సుదీప్ నివాసంతో పాటు కన్నడ ఫిల్మ్ ఇండ్రస్ట్రీలోని దాదాపు 10 మంది సినీ దిగ్గజాలపై ఏకకాలంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. కన్నడ బిగ్ ప్రొడ్యూసర్ రాక్లైన్ వెంకటేష్ను కూడా వదలని ఐటీ అధికారులు... కేజీఎఫ్ ప్రొడ్యూసర్ విజయ్ సహా శివ్ రాజ్కుమార్, సీఆర్ మనోహర్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా టాప్ హీరోను టార్గెట్ చేయడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం