కింగ్డమ్ని సందర్శించిన 10.3 మిలియన్ పర్యాటకులు
- January 04, 2019బహ్రెయిన్:2018 ఏడాదిలో 10.3 మిలియన్ టూరిస్టులు బహ్రెయిన్లో పర్యటించారు. 2017తో పోల్చితే, 2018లో 10.3 శాతం పెరుగుదల చోటు చేసుకోవడం ద్వారా కింగ్డమ్లో పర్యాటకం ఆశించిన రీతిలో వృద్ధి చెందుతోందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం మరియు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ ఈ వివరాల్ని వెల్లడించడం జరిగింది. టూరిస్టులు బహ్రెయిన్లో మొత్తం 9.8 మిలియన్ రోజులు స్పెండ్ చేసినట్లయ్యింది. ఇది 22.3 శాతం అధికం గత ఏడాదితో పోల్చి చూస్తే. 2018 తొలి తొమ్మిది నెలల్లో 9.1 మిలియన్ పర్యాటకులు వచ్చినట్లు నిర్ధారితమయ్యింది. గత ఏడాది ఈ కాలంతో పోల్చితే 5.7 శాతం పెరుగుదల ఈ ఏడాది నమోదయ్యింది. వాటెల్ హెటల్, టూరిజం బిజినెస్ స్కూల్ వంటి వాటిని ఈ ఏడాది బహ్రెయిన్ ప్రారంభించింది. ఇవన్నీ టూరిజం వృద్ధికి ఉపకరిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం