మరో ఘనత సాధించిన అంగవైకల్య మహిళ
- January 05, 2019న్యూఢిల్లీ: 2013లో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి అంగవైకల్య మహిళగా రికార్డు సృష్టించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత అరునిమ సిన్హా.. మరో ఘనత సాధించింది. అంటార్కిటికాలో అత్యంత ఎత్తైన శిఖరం విన్సన్ను అధిరోహించిన మొదటి అంగవైకల్య మహిళగా రికార్డు సాధించింది.''నిరీక్షణ అంతమైంది. సరికొత్త ప్రపంచ రికార్డును మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. విన్సన్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి అంగవైకల్య మహిళగా రికార్డు సృష్టించాను. మీ అందరి ప్రార్థనలకు, ఆశీస్సులకు కృతజ్ఞతలు'' అని అరునిమ ట్విట్టర్లో రాసుకొచ్చింది.కాగా అరునిమకు ప్రధాన మంత్రి మోడీ అభినంధనలు తెలిపారు. ''సరికొత్త ఘనత సాధించిన అరునిమ సిన్హాకు అభినంధనలు. ఆమె ఇండియాకు గర్వకారణం. తన పట్టుదల, కృషితో ఈ విజయాన్ని సాధించింది. అరునిమకు మంచి భవిష్యత్ ఉంది'' అని ట్విట్టర్లో మోడీ రాసుకొచ్చారు. అంతే కాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాతో పాటు పలువురు ప్రముఖులు అరునిమను అభినందించారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!