అభిమానులకు షాకిచ్చిన తలైవా!
- February 17, 2019సూపర్స్టార్ రజనీకాంత్ అభిమానులకు షాకిచ్చారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు రజనీ. అంతే కాదు తాను ఏ పార్టీకి మద్దతు కూడా తెలపనని వెల్లడిస్తూ తాజాగా ఓ ప్రెస్నోట్ను విడుదల చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయబోతున్నట్లు తెలిపారు రజనీకాంత్. తన అభిమాన సంఘాలు కానీ, ఇతర పార్టీ వర్గాలు కానీ ప్రచారం కోసం తన పేరును వాడుకోవద్దని హెచ్చరించారు. తమిళనాడుకు నీటి సమస్యలు లేకుండా చేసే పార్టీకే త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు.
రజనీ ఇప్పటివరకు తన పార్టీ పేరు కూడా ప్రకటించలేదు. రజనీ మక్కల్ మండ్రమ్ అనే అభిమాన సంఘం పేరిట తన రాజకీయ కార్యకలాపాలను చేపడుతున్నారు. కానీ ఇప్పటి వరకు పార్టీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోలేదు. లోక్సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. కానీ తాజా ప్రకటనతో అభిమానుల్లో నిరాశ నెలకొంది.
రజనీ కాంత్ పార్టీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? పార్టీ పేరేంటి? దాని విధి విధానాలేంటి అన్నదానిపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అభిమానులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన