రేపే 'సర్వం తాళ మయం' విడుదల..
- March 07, 2019శంకరాభరణం, సాగర సంగమం వంటి అద్భుత సంగీత భరిత చిత్రాలను అందించిన కళాతపస్వి కె. విశ్వనాథ్ రాజీవ్ మీనన్ రూపొందించిన 'సర్వం తాళ మయం' చిత్రాన్ని చూసి, "చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశాను. రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించి, ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్ కి నా ఆశీర్వాదాలు." అని అభినందించి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
అలాగే ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, మహానటి దర్శకులు నాగ అశ్విన్, యాత్ర దర్శకులు మహి వీ రాఘవ్ ఈ చిత్రాన్ని చూసి రాజీవ్ మీనన్ ని ఎంతగానో ప్రశంసించారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. మార్చ్ 8 న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం అన్ని మల్టి ప్లెక్స్ ధియేటర్లలోనూ విడుదల చేస్తున్నట్టు దర్శక నిర్మాత రాజీవ్ మీనన్ చెప్పారు.
జి వి ప్రకాష్, అపర్ణ బాలమురళి హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రంలో నేడుముడి వేణు, వినీత్, దివ్య దర్శిని ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి, సంగీతం : ఏ ఆర్ రహమాన్, సినిమాటోగ్రఫీ : రవి యాదవ్, ఆర్ట్ : సి ఎస్ ఆనందన్, లిరిక్స్ : రాకెందు మౌళి, డైలాగ్స్ : ఘంటసాల రత్న కుమార్, ఏక్షన్ : దినేష్ సుబ్బరాయ యన్, ఎడిటింగ్ : అంతోని
నిర్మాత : లత
కథ, కథనం, దర్శకత్వం : రాజీవ్ మీనన్.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్