ఇండియన్ హైస్కూల్ సీఈఓకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్
- March 07, 2019దుబాయ్: 2019 జిఇఎస్ఎస్ అవార్డ్స్ కార్యక్రమంలో ఇండియన్ హైస్కూల్ దుబాయ్ సీఈఓ డాక్టర్ అశోక్కుమార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. తాలీమ్తో కలిసి ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఎడ్యుకేషన్ విభాగంలో 30 ఏళ్ళ అనుభవం కలిగిన డాక్టర్ కుమార్ని, న్యాయ నిర్ణేతలు లీడర్గా గుర్తించారు. పలు గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని విజయవంతంగా నిర్వహిస్తున్న అశోక్కుమార్పై ప్రశంసల వర్షం కురిసింది. తాలీమ్ సీఈఓ రాస్ మార్షల్ మాట్లాడుతూ, డాక్టర్ కుమార్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అనీ, ఇండియన్ హైస్కూల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళారని చెప్పారు. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆయన సాధించిన పేరు ప్రఖ్యాతులు అమోఘమని అన్నారు. 2001లో భారత కేంద్ర విద్యా శాఖ మంత్రి మురళీ మనోహర్ జోషీ చేతుల మీదుగా బెస్ట్ ప్రిన్సిపల్ జాతీయ అవార్డుని అందుకున్నారు. యూఏఈలో షేక్ హమదాన్ అవార్డుని కూడా అందుకున్నారాయన.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్