చైనా తీరు మారలేదు..అజర్ ను మళ్ళీ వెనకేసుకొస్తున్న చైనా
- March 14, 2019బీజింగ్: మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనను మరోసారి అడ్డుకున్న చైనా.. తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఈ అంశంలో మరింత లోతైన విచారణ చేపట్టడానికి ఇంకా సమయం కావాలని చైనా చెప్పడం గమనార్హం. అదే సమయంలో తాము ఇండియాతో మంచి సంబంధాలనే కోరుకుంటున్నామని, ఇలాంటి అంశాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసమే తాము చూస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూ కాంగ్ వివరించారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్ తీసుకొచ్చిన ఈ తీర్మానాన్ని ఎందుకు అడ్డుకున్నారు అని ప్రశ్నించగా.. ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీకి వచ్చే ప్రతి దరఖాస్తునూ చైనా క్షుణ్నంగా, లోతుగా పరిశీలిస్తుందని, దీనికి మరింత సమయం కావాలని లూ కాంగ్ చెప్పారు. ఓ వ్యక్తి లేదా సంస్థపై ఉగ్రవాద ముద్ర వేయడానికి భద్రతా మండలి ఆంక్షల కమిటీకి కొన్ని ప్రామాణికాలు, ప్రక్రియలు ఉన్నాయి. వాటిపై చైనా పూర్తిగా అధ్యయనం చేస్తుంది. అందుకే మేము ఈ అంశాన్ని సాంకేతికంగా నిలిపి ఉంచామని లూ కాంగ్ వెల్లడించారు. ఈ ప్రాంత సుస్థిరత, శాంతికి చైనా బాధ్యతయుతంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఇండియా, చైనా సంబంధాలపై ప్రశ్నించగా.. ఇప్పటికే జీ జిన్పింగ్, మోదీ గతేడాది నాలుగుసార్లు భేటీలు నిర్వహించారని, రెండు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం