రాజమౌళి చెప్పిన 'RRR' కథ
- March 14, 2019

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో నేషనల్ లేవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు రాజమౌళి. దీంతో రాజమౌళి తరువాత తీసే సినిమాలకు బాగా డిమాండ్ పెరిగింది. రాజమౌళి ప్రస్తుత తెలుగులో ఓ భారీ మల్టీ స్టారర్కు తెరలేపిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ హీరోలు అయిన ఎన్టీఆర్ , రామ్ చరణ్ను హీరోలుగా పెట్టి 'RRR'అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఎన్టీఆర్ , రామ్ చరణ్లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ముందుగా సినిమాలోని ఫైట్స్ను షూటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సబంధించి మీడియా సమావేశం పెట్టారు రాజమౌళి. సినిమా కథ గురించి మొదటిసారి మీడియాతో మాట్లాడారు రాజమౌళి. ఇది 1920 సంవత్సరంలో జరిగిన కథ ఇదని చెప్పారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్టెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నామని తెలిపారు రాజమౌళి. తాను తీసిన అన్ని సినిమా కథలను ముందుగానే మీడియాతో పంచుకునే అలవాటు ఉంది, దీనిలో భాగంగానే ఈ సినిమా కథను కూడా మీతో పంచుకోవాడానికి వచ్చానని తెలిపారు రాజమౌళి.
ఈ సినిమా కథను కొమరం బీమ్, అల్లూరి సీతారామరాజు జీవిత కథల ఆధారంగా అల్లుకున్న కథతో ఈ సినిమా చేస్తున్నానని ప్రకటించారు రాజమౌళి. ఇక ఈ సినిమాలో ఇప్పటి వరకు హీరోయిన్లను ఎంపిక చేయలేదు. మార్కెట్ దృష్ట్యా బాలీవుడ్ హీరోయిన్స్ను తీసుకుందమని ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పరిణితి చోప్రా, అలియా భట్లను ఈ సినిమాలో హీరోయిన్స్కు తీసుకునే ఆలోచనట చేస్తున్నాడట రాజమౌళి. సినిమాను 2020 చివర్లో విడుదల చేస్తారని సమాచారం.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







