రాజమౌళి చెప్పిన 'RRR' కథ
- March 14, 2019

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో నేషనల్ లేవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు రాజమౌళి. దీంతో రాజమౌళి తరువాత తీసే సినిమాలకు బాగా డిమాండ్ పెరిగింది. రాజమౌళి ప్రస్తుత తెలుగులో ఓ భారీ మల్టీ స్టారర్కు తెరలేపిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ హీరోలు అయిన ఎన్టీఆర్ , రామ్ చరణ్ను హీరోలుగా పెట్టి 'RRR'అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఎన్టీఆర్ , రామ్ చరణ్లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ముందుగా సినిమాలోని ఫైట్స్ను షూటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సబంధించి మీడియా సమావేశం పెట్టారు రాజమౌళి. సినిమా కథ గురించి మొదటిసారి మీడియాతో మాట్లాడారు రాజమౌళి. ఇది 1920 సంవత్సరంలో జరిగిన కథ ఇదని చెప్పారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్టెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నామని తెలిపారు రాజమౌళి. తాను తీసిన అన్ని సినిమా కథలను ముందుగానే మీడియాతో పంచుకునే అలవాటు ఉంది, దీనిలో భాగంగానే ఈ సినిమా కథను కూడా మీతో పంచుకోవాడానికి వచ్చానని తెలిపారు రాజమౌళి.
ఈ సినిమా కథను కొమరం బీమ్, అల్లూరి సీతారామరాజు జీవిత కథల ఆధారంగా అల్లుకున్న కథతో ఈ సినిమా చేస్తున్నానని ప్రకటించారు రాజమౌళి. ఇక ఈ సినిమాలో ఇప్పటి వరకు హీరోయిన్లను ఎంపిక చేయలేదు. మార్కెట్ దృష్ట్యా బాలీవుడ్ హీరోయిన్స్ను తీసుకుందమని ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పరిణితి చోప్రా, అలియా భట్లను ఈ సినిమాలో హీరోయిన్స్కు తీసుకునే ఆలోచనట చేస్తున్నాడట రాజమౌళి. సినిమాను 2020 చివర్లో విడుదల చేస్తారని సమాచారం.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









