న్యూజిలాండ్లో కాల్పల కలకలం
- March 15, 2019న్యూజిలాండ్లో కాల్పలు కలకలం సృష్టించాయి. క్రైస్ట్చర్చ్ నగరంలోని ఓ మసీదులో ఓ ఆగంతుకుడు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. నల్లరంగు బట్టలు వేసుకున్న ఓ వ్యక్తి అల్ నూర్ మసీదు లోపలకు వచ్చి కాల్పులు జరిపినట్టు స్థానికులు చెపుతున్నారు..
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు. నగరంలోని ప్రజలు ఎవరూ బయటికి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడితో భయభ్రాంతులకు లోనైన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. మసీదులో పలు మృతదేహాలు పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ దాడి నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు. టెస్ట్ సిరీస్లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో మూడో టెస్టు ఆడనున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు దాడి సమయంలో ఆ ప్రాంతంలోనే ఉన్నారు. బంగ్లా క్రికెటర్లు అక్కడ నుంచి బయటపడ్డ సయంలోనే ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం