ఏపీ లో రిలీజ్ అవ్వనున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'
- April 10, 2019సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్'మొదటి నుంచి ఎన్నో వివాదాలు సృష్టిస్తూ వచ్చింది. ఈ సినిమా టీడీపీ అధినేత చంద్రబాబు ను విమర్శించేలా ఉందని ఒక వర్గం వారు పోలీసు కేసులు పెట్టడం..కోర్టు మెట్లక్కడం ఎన్నో రకాలుగా మూవీ రిలీజ్ ఆపే ప్రయత్నం చేశారు. ఈ మూవీ గత నెల 29 ఒక్క ఏపిలో తప్ప అన్ని రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యింది. ఇక తెలంగాణాలో సినిమా రిలీజ్ అవటంతో...బాగుందని టాక్ రావటంతో ఈ మూవీపై ఆంధ్రా జనాల్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ నేపథ్యంలో పైరసీ ప్రింట్ ఎపిలో కనిపించింది..చాలా మంది వీక్షించారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ ఏపీలో విడుదలపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు ఇవాళ మధ్యాహ్నం ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం వీక్షించనుంది. న్యాయమూర్తుల చాంబర్లో న్యాయవాదుల సమక్షంలో ఈ మూవీ ప్రదర్శించనున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఈ వారంలోనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదల అవుతుందని దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. వాదాలు, వివాదాలు, సవాళ్లు, ఒత్తిళ్లు మధ్య రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రెండువారాల క్రితం తెలంగాణలో విడుదలైంది.
కోర్ట్ తీర్పు కారణంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం రిలీజ్ ఆగి పోయిన విషయం తెలిసిందే. సినిమాకు హైప్ తీసుకురావడం, చంద్రబాబుని విలన్ గా చూపటం వంటి అంశాలు వల్ల తెలంగాణలో ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ తెచ్చాయి. ఏప్రియల్ 12న సినిమా రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం