ప్లిప్కార్ట్లో 50 వేల ఉద్యోగాలు..
- April 24, 2019ఇ-కామర్స్ దిగ్గజం ప్లిప్కార్ట్ వ్యాపారాన్ని మరింత విస్తరింపజేస్తుంది. లాజిస్టిక్స్ రంగంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది ప్లిప్కార్ట్. దీనిద్వారా 50,000ల ఉద్యోగాలకు రూపకల్పన జరుగుతుందని ఓ అంచనా. ఇప్పటికే ప్లిప్కార్ట్ని నడిపిస్తున్న వాల్మార్ట్ గురుగ్రామ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్లో లాజిస్టిక్స్ పార్క్స్ ఏర్పాటు కోసం 300 ఎకరాల భూమిని సేకరిస్తుంది. భారతదేశంలో ప్రధాన పోటీదారుగా ఉన్న అమెజాన్ను ఢీ కొట్టేందుకు ఈ ప్రణాళికలు ఉపయోగపడతాయని వాల్మార్ట్ భావిస్తోంది. ఈ లాజిస్టిక్ పార్కులు సరుకు రవాణా, పంపిణీ కేంద్రాలుగా పనిచేస్తాయి. ప్లిప్కార్ట్ చేపట్టిన నెక్ట్స్ 200 మిలియన్ కస్ట్మర్స్ ప్రాజెక్టు లక్ష్యాన్ని చేరేందుకు ఈ కొత్త లాజిస్టిక్ పార్కులు తోడ్పడతాయని కంపెనీ అధికార వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు