'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేదిక ఖరారు
- April 24, 2019
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా 'మహర్షి' రూపొందింది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను, వచ్చేనెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. వచ్చేనెల 1వ తేదీన హైదరాబాద్ - నెక్లెస్ రోడ్ లోని 'పీపుల్స్ ప్లాజా'లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇది మహేశ్ బాబుకి 25వ సినిమా కావడం వలన మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. కాలేజ్ స్టూడెంట్ గా .. విదేశాల్లోని ఒక సంస్థకి సీఈవోగా .. రైతుగా ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, 'అల్లరి' నరేశ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







