టీచర్ ఉద్యోగం.. జీతం రూ.3 లక్షలు..
- April 26, 2019కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. పడితే పట్టాలిరా యూ.ఏ.ఈ లో టీచర్ ఉద్యోగం.. అవును మరి అక్కడ పంతులమ్మకి రూ.3 లక్షల జీతమట. ఆహా! అదృష్టమంటే వారిది అని అనుకోకండి. మన దేశం నుంచి వెళ్లిన టీచర్లకు కూడా రూ. 3 లక్షలకు పైగానే జీతం ఇచ్చి మరీ తీసుకుంటున్నారు. ఎమిరేట్ గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేయడానికి దాదాపు 3,000 మంది టీచర్ల నియామక ప్రక్రియను చేపట్టింది. ఇందుకు సంబంధించిన రాత పరీక్ష, ఇంటర్వ్యూ లాంటివి అన్నీ ముంబై, ఢిల్లీ కేంద్రాల్లో జరుగుతాయి.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.3,04,017 జీతం లభించనుంది. మన దేశంలోని టీచర్లు అందుకుంటున్న వేతనంతో పోలిస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువ. యూ.ఏ.ఈ వచ్చి ఉద్యోగం చేసే అభ్యర్థుల కోసం మరిన్ని సదుపాయాలు కల్పించడానికి సిద్ధమవుతోంది గవర్నమెంట్. ఎంపికైన అభ్యర్థుల కుటుంబాల కోసం కొత్త వీసా నిబంధనలను తీసుకురావలనుకుంటోంది. యూ.ఏ.ఈ లో ప్రైవేట్ స్కూళ్లతో సరిసమానంగా ప్రభుత్వ స్కూళ్లు సరైన విద్యను అందించలేకపోతున్నాయట. అందుకే పరిస్థితిని చక్కదిద్దేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు ఏ మాత్రం తీసిపోని విధంగా విద్యార్థులను తయారు చేయాలనుకుంటోంది. ఈ మేరకు టీచర్ల నియామక ప్రక్రియను చేపట్టింది.
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం