కర్ణాటక లో హై అలర్ట్‌

- April 27, 2019 , by Maagulf
కర్ణాటక లో హై అలర్ట్‌

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు, మైసూర్‌ నగరాలకు హై అలర్ట్‌ను ప్రకటించారు. శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల అనంతరం కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇంటలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు ఈ రెండు నగరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో, మతసంబంధ ప్రదేశాల్లో, మార్కెట్లు, మాల్స్‌, మల్టీపెక్స్‌లు, రైల్వే స్టేషన్‌, బస్‌ స్టేషన్‌, రద్దీ ప్రదేశాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ టీ. సునీల్‌ కుమార్‌ తెలిపారు. అదేవిధంగా హోటళ్లు, పబ్స్‌, రెస్టారెంట్లు, మ్యారేజ్‌ ఫంక్షన్‌హాల్స్‌, మల్టీ కాంప్లెక్స్‌లు, సూపర్‌ మార్కెట్ల నిర్వాహాకులను తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com