మే 2న తెలంగాణ బంద్
- April 30, 2019తెలంగాణలో ఇంటర్ బోర్డు అరాచకాలపై ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. వచ్చే నెల రెండో తేదీ వరకు పోరాటం కొనసాగిస్తామని అఖిలపక్ష నాయకులు స్పష్టంచేశారు. ప్రభుత్వం ఎంతగా నిర్బంధానికి పాల్పడినా.. తొలిరోజు ధర్నా విజయవంతం అయిందన్నారు. మే ఒకటో తేదీన కొవ్వుత్తుల ర్యాలీకి అఖిలపక్షం ప్లాన్ చేసింది. చనిపోయిన విద్యార్థులకు ట్యాంక్బండ్పై నివాళి అర్పించనున్నారు. మరణించిన ప్రతి విద్యార్థి కుటుంబాన్ని కలుస్తామని నేతలు చెప్పారు.
బీజేపీ కార్యాలయంలో నిన్న దీక్షకు దిగిన ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ను.. పోలీసులు అరెస్టు చేసి.. బలవంతంగా నిమ్స్కు తరలించారు. వైద్యం తీసుకునేందుకు నిరాకరించిన ఆయన.. నిరశన కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి కమలనాథులు కదలనున్నారు. మే 2న తెలంగాణ బంద్కు లక్ష్మణ్ పిలుపిచ్చారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించి.. భవిష్యత్లో రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అటు ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్టూడెంట్ యూనియన్ల నిరసనలు కొనసాగుతున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు