కన్ఫర్మ్: మహేశ్ కోసం వెంకీ, విజయ్ దేవరకొండ రెడీ
- May 01, 2019మహేశ్ బాబు 25వ చిత్రం'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ జరగనుంది. హైదరాబాద్లోని నెక్లస్రోడ్లో ఈ కార్యక్రమం జరగనుండగా.. దీనికి ముఖ్య అతిథులుగా విక్టరీ వెంకటేశ్, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ రానున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కోసం వెంకటేశ్, మహేశ్ బాబు తొలిసారిగా కలిసి నటించగా.. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో గతంలో మహేశ్ నటించిన 'శ్రీమంతుడు' ఆడియో ఫంక్షన్కు కూడా వెంకటేశ్ చీఫ్ గెస్ట్గా వచ్చిన విషయం తెలిసిందే. కాగా మరోవైపు విజయ్ దేవరకొండ ఇప్పటివరకు చిన్న హీరోల ఫంక్షన్లకు అతిథిగా రాగా.. తొలిసారిగా ఓ పెద్ద స్టార్ నటుడికి గెస్ట్గా మారడం విశేషం.
కాగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన 'మహర్షి' చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటించింది. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. దిల్ రాజ్, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మహేశ్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం కావడం, ఇప్పటికే రిలీజైన టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో 'మహర్షి'పై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి