తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- April 30, 2024
తెలంగాణ అగ్నిగోళంలా మండిపోతోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వడగాలులు వీయడంతో పాటు భగ్గుమంటున్న ఎండలతో నిన్న వడదెబ్బకు గురై ఐదుగురు చనిపోయారు. ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండగా.. 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న అత్యధికంగా నిజామాబాద్లో 43.8 డిగ్రీలు, ఖమ్మంలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్ రోడ్లు కూడా జనాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. బయట ఉష్ణోగ్రతలతో రూమ్ టెంపరేచర్లు కూడా విపరీతంగా పెరగడంతో ఇంట్లో ఉన్నవాళ్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. 40-44 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రేపు 61 మండలాల్లో తీవ్ర వడగాలులు, 173 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఎల్లుండి 90 మండలాల్లో తీవ్ర వడగాలులు, 202 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. తీవ్రతను బట్టి పలు మండలాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. అసలు ఎలా ప్రారంభమైంది?
- పదేళ్లలో 100 కొత్త ఎయిర్పోర్టులు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
- ఈద్ అల్ అధా సందర్భంగా 230 మంది ఖైదీలకు అజ్మాన్ రూలర్ క్షమాభిక్ష
- బాల్య వివాహాలను ప్రేరేపించినందుకు జైలు శిక్ష, Dh5 మిలియన్ల జరిమానా..!!
- గుండెపోటు.. నలుగురు హజ్ యాత్రికులు రక్షించిన వైద్య బృందాలు..!!
- యూఏఈ లాటరీ డ్రా..విజేత IDలు ఇవే..!!
- మానవ అక్రమ రవాణా కేసులో ఆసియా మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఈద్ అల్ అధాకు భారతీయ మేకలకు డిమాండ్..!!
- జలీబ్లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం.. 5 మంది మృతి..!!
- మే నెల వేతనాలపై ఒమన్ లేబర్ మినిస్ట్రీ కీలక ప్రకటన..!!









