మద్యం మత్తులో సోదరిపై కాల్పులు జరిపిన కువైటీ
- May 11, 2019కువైట్: కువైటీ వ్యక్తి ఒకరు మద్యం మత్తులో తన సోదరిపైనే కాల్పులు జరిపిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన ఆపరేషన్ రూమ్కి ఈ సమాచారం అందింది. సమాచారం అందుకోగానే, సంఘటనా స్థలానికి పారామెడిక్స్, సెక్యూరిటీ సిబ్బంది చేరుకున్నారు. ఆ సమయంలో సంఘటనా స్థలంలో కలష్నికోవ్ గన్తో నిందితుడు కన్పించాడు. తన సోదరితో జరిగిన గొడవ కారణంగా తాను ఆమెపై దాడి చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతోంది. ఆ పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు వెల్లడించారు. నిందితుడి సోదరుల్ని ఈ కేసులో సాక్షులుగా పరిగణిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు