ఇఫ్తార్ హోస్టింగ్ ఎంతో సంతృప్తికరం: క్రిస్టియన్ వలసదారుడు
- May 11, 2019
ఫుజైరా కి చెందిన భారత వలసదారుడు సాజి చెరియన్, యూఏఈలో ఓ మసీదు నిర్మించడమే కాక, ఇఫ్తార్ విందును కూడా ఏర్పాటు చేస్తున్నారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు సేవ చేసుకునే భాగ్యం తనకు కలిగిందని క్రిస్టియన్ అయిన సాజి చెరియన్ చెప్పారు. బ్లూ కాలర్ వర్కర్స్ కోసమే అన్ని అనుమతులూ తీసుకుని మసీదు నిర్మించినట్లు చెప్పారాయన. ఫుజైరా చేరుకోవాలంటే 20 నుంచి 30 దిర్హామ్లు ట్యాక్సీ ఫేర్ చెల్లించాల్సి వుంటుందనీ, అలా డబ్బు వెచ్చించలేని వారి కోసమే మసీదు నిర్మించానని అన్నారు చెరియన్. ఎయిర్ కండిషన్డ్ కన్వెన్షన్ సెంటర్ని నిర్మించి, అక్కడే వందలాది మంది కార్మికులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు. 2004లో చెరియన్ దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి ఆయన విజయ ప్రస్థానం ప్రారంభమయ్యింది. ఇప్పుడాయన ఓ వ్యాపార వేత్తగా ఎదిగారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..







