18న శనివారం జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ ప్రారంభం
- May 17, 2019అమీర్పేట టూ హైటెక్ సిటీ మెట్రో మార్గం మొత్తం క్లియర్ అయ్యింది. పెండింగ్ లో ఉన్న, కీలకమైన జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ ను ప్రారంభించటానికి ముహూర్తం ఖరారు చేశారు. 2019, మే 18వ తేదీ శనివారం ఉదయం నుంచి సర్వీసులు ప్రారంభించనున్నారు. ఈ మార్గంలో మెట్రో సర్వీసులు మార్చి 20న ప్రారంభం అయ్యాయి.
మాదాపూర్, పెద్దమ్మతల్లి, జూబ్లీహిల్స్ చెక్పోస్టు మెట్రోస్టేషన్లలో సర్వీసులకు బ్రేక్ పడింది. విడతల వారీగా మొదట మాదాపూర్, ఆ తర్వాత పెద్దమ్మతల్లి స్టేషన్లను ప్రారంభించారు. మిగిలిన ఒకే ఒక్క జూబ్లీహిల్స్ స్టేషన్ ను మాత్రం మే 18, శనివారం నుంచి ఓపెన్ చేస్తున్నారు. ఈ స్టేషన్ ప్రారంభంతో నాగోల్ నుంచి హైటెక్ సిటీ మధ్యలో అన్ని స్టేషన్లు అందుబాటులోకి వచ్చినట్లే.
అమీర్ పేట టూ హైటెక్ సిటీ మధ్యలో స్టేషన్లు :
1. మధురానగర్
2. యూసఫ్ గూడ
3. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-5
4. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు
5. పెద్దమ్మతల్లి గుడి
6. మాదాపూర్
7. దుర్గంచెరువు
8. హైటెక్ సిటీ
తాజా వార్తలు
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..