ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- May 06, 2024
మనామా: ఇన్వెస్ట్ స్కామ్ కేసులో బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి లోయర్ క్రిమినల్ కోర్ట్ ఒక వ్యక్తికి ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అతను BD82,000 బౌన్స్ చెక్కును జారీ చేశాడు.
వీటితో పాటు వ్యక్తులను మోసం చేయడం, దేశం నుండి పారిపోవడం ద్వారా అధికారులను తప్పించుకోవడం వంటి పలు ఆరోపణలపై కేసులను నమోదు చేశారు. 13 సంవత్సరాలకు పైగా తప్పించుకున్న తర్వాత, నిందితుడు బహ్రెయిన్కు తిరిగి వచ్చిన తర్వాత అరెస్టు చేశారు. పెట్టుబడి అవకాశాల ముసుగులో వ్యక్తులను మోసం చేసి, ఆ తర్వాత దేశం నుండి పరారీలో ఉన్నాడని నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూషన్ జారీ చేసిన వారెంట్ ఆధారంగా అరెస్టును అమలు చేస్తూ ఆర్థిక నేరాల నిరోధక విభాగం వేగంగా చర్యలు చేపట్టింది. సమర్పించబడిన సాక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, తగిన నిధులు లేకుండా బౌన్స్ అయిన చెక్కును జారీ చేసిన నేరానికి ప్రతివాది దోషిగా కోర్టు నిర్ధారించింది. ఇది బహ్రెయిన్ చట్టం ప్రకారం తీవ్రమైన జరిమానాలను విధించే ఉల్లంఘన అని తెలిపింది.
తాజా వార్తలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!







