సంచలనం.. పుల్వామా ఉగ్రదాడి వెనుక మన జవాన్..
- May 18, 2019పాకిస్థాన్కు చెందిన యువతి పన్నిన వలలో చిక్కిన ఒక భారత జవాను, సైనిక రహస్యాలను ఆమెకు, తద్వారా పాక్ ఉగ్రవాదులకు అందించాడు. ఆ సమాచారంతోనే ఉగ్రవాదులు పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి, 40 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నారు.మధ్యప్రదేశ్ ఉగ్రవాద వ్యతిరేకదళం, కేంద్ర నిఘా సంస్థలు చేసిన దర్యాప్తులో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
ఇండోర్ సమీపంలోని మోహో పట్టణంలో బీహర్ రెజిమెంటలో నాయక్ క్లర్కుగా అవినాశ్ కుమార్ అనే యువకుడు పని చేసేవాడు. 2018లో అతడిని అసోంకు బదిలీ చేశారు. ఆ సమయంలో అతడికి వాట్సాప్ లో ఓ పాకిస్థాన్ యువతితో పరిచయం ఏర్పడింది. తన అందచందాలతో అవినాశ్ను వలలో వేసుకున్న ఆ యువతి.. సైనిక రహస్యాలను అతడి వద్ద కూపీ లాగి ఉగ్రవాదులకు చేరవేసేది.
అవినాశ్ ఇచ్చిన సమాచారంతో పక్కా ప్రణాళిక రచించుకున్న ముష్కరులు.. పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అవినాశ్ బ్యాంక్ ఖాతాలో పాకిస్థాన్ నుంచి 50వేల రూపాయల నగదు కూడా జమ అయ్యిందని దర్యాప్తులో తేలింది. భోపాల్లోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్కు తరలించారు. అవినాశ్ తండ్రి కూడా జవానే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం