సీనియర్ నటులు రాళ్ళపల్లి ఇకలేరు
- May 18, 2019
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటులు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. రాళ్లపల్లి 1955 అక్టోబర్ 10న తూర్పు గోదావరి జిల్లాలోని రాచపల్లిలో జన్మించారు. 1979లో కుక్కకాటుకు చెప్పు దెబ్బ సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆయన 850 సినిమాల్లో నటించారు. రాళ్లపల్లి చిన్నతనం నుంచే నాటకాలు వేసేవారు. సినీ పరిశ్రమలో ఎన్నో అవార్డులు అందుకొన్నారు. రాష్ట్ర నంది పురస్కారాన్ని మూడుసార్లు అందుకొన్నారు. 1976లో ఊరుమ్మడి బతుకులు చిత్రంలో నటనకు గాను ఉత్తమ కామెడీ నటుడిగా జాతీయ అవార్డును అందుకొన్నారు. గణపతి అనే సీరియల్లో ఉత్తమ సహయనటుడిగా నంది అవార్డును పొందారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









