సీనియర్ నటులు రాళ్ళపల్లి ఇకలేరు
- May 18, 2019టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటులు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. రాళ్లపల్లి 1955 అక్టోబర్ 10న తూర్పు గోదావరి జిల్లాలోని రాచపల్లిలో జన్మించారు. 1979లో కుక్కకాటుకు చెప్పు దెబ్బ సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆయన 850 సినిమాల్లో నటించారు. రాళ్లపల్లి చిన్నతనం నుంచే నాటకాలు వేసేవారు. సినీ పరిశ్రమలో ఎన్నో అవార్డులు అందుకొన్నారు. రాష్ట్ర నంది పురస్కారాన్ని మూడుసార్లు అందుకొన్నారు. 1976లో ఊరుమ్మడి బతుకులు చిత్రంలో నటనకు గాను ఉత్తమ కామెడీ నటుడిగా జాతీయ అవార్డును అందుకొన్నారు. గణపతి అనే సీరియల్లో ఉత్తమ సహయనటుడిగా నంది అవార్డును పొందారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్