తమిళనాడులో ఐసిస్ జాడలు కలకలం..
- May 21, 2019తమిళనాడులో ఐసిస్ జాడలు కలకలం రేపాయి. వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న 10 మంది ఇళ్లల్లో ఏకకాలంలో NIA సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర జరుగుతుందన్న అనుమానంతో తనిఖీలు జరుపుతున్నారు. లాల్పేట్, దేవీపట్టినం, కిలాకరాయి, ముత్తుపేట్, సాలెం తదితర 10 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అధికారులు ఇప్పటివరకు కొన్ని డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో 3 ల్యాప్టాప్లు, 3 హార్డ్డిస్క్లు, 16 మొబైల్ ఫోన్లు, 8 సిమ్ కార్డులు, 2 పెన్డ్రైవ్లు, 5 మెమొరి కార్డులు, ఒక కార్డ్ రీడర్లు ఉన్నాయి. అంతేగాక రెండు కత్తులు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై గతంలో అధికారులు ఈ ప్రాంతాలకు చెందిన ఈ 10 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ‘2018లో ఆయుధాలు, నిధుల సేకరణ, ఉగ్ర భావజాల వ్యాప్తితో పాటు పలు కార్యకలాపాల కోసం వారు కుట్ర పన్నుతున్నారన్న సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పది మందిలో 9 మందిని అరెస్ట్ చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. ఇక నిందితులకు బెయిల్ లభించడంతో 9 మందిని విడుదల చేశారు. అయితే వారు తిరిగి ఐసిస్ కు సహాయం చేస్తున్నారన్న అనుమానంతో సోదాలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి