ఇంగ్లండ్ బయలుదేరిన కోహ్లిసేన
- May 22, 2019ముంబై: ప్రపంచకప్ కోసం టీమిండియా జట్టు లండన్కు పయనమైంది. బుధవారం తెల్లవారుఝామున ముంబై ఎయిర్పోర్ట్ నుంచి కోహ్లిసేన ఇంగ్లాండ్కు పయనమైంది. కోహ్లి, ధోని సహా ఇతర ఆటగాళ్లు అధికార దుస్తుల్లో విమానాశ్రయంలో ఉన్న ఫోటోలను బిసిసిఐ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, బౌలర్లు బుమ్రా, చాహల్, హార్థిక్ పాండ్యా కూడా ఫోటోలు ట్వీట్ చేశారు.
మొదటగా జూన్5న దక్షిణాఫ్రికాతో మ్యాచ్తో భారత్ తన ప్రయాణం మొదటుపెట్టనుంది. అంతకంటే ముందు న్యూజిలాండ్, బంగ్లాదేశ్లో కోహ్లిసేన రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. ఇంగ్లాండ్ బయలుదేరే ముందు కోహ్లి, రవిశాస్త్రి మంగళవారం మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగతంగా ఇది తనకు అత్యంత సవాలుతో కూడుకున్న ప్రపంచకప్ అనిపిస్తుంది.
ఏ జట్టు ఏ జట్టుకైనా షాకివ్వచ్చు, ఫార్మాట్ ఇంతకుముందులా లేదు కాబట్టి ప్రతి మ్యాచ్లో ఉత్తమ ప్రదర్శన చేయాల్సిందే. ఇదో భిన్నమైన సవాల్, దీనికి ఎంత వేగంగా అలవాటు పడతామన్నది కీలకం అని కోహ్లి అన్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన