ఇందిరాగాంధీ పాత్రలో అలనాటి అందాల తార
- May 29, 2019ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రవీనాటాండన్ ఇప్పుడు ముఖ్యపాత్రలలో మెరుస్తోంది. 90వ దశకంలో అక్కినేని నటించిన రధసారథిలోనూ, బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు చిత్రంలోనూ రవీనాటాండన్ కథనాయికగా నటించింది. అయితే ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలే చేస్తూ వచ్చిన ఆమె ఇన్నేళ్ల తర్వాత దక్షిణాది సినిమాలో నటించేందుకు అంగీకరించిందన్న టాక్ హల్చల్ చేస్తోంది. ఆ మధ్య కన్నడంలో రూపొందిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలియంది కాదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్గా కేజీఎఫ్: చాప్టర్-2 చిత్రం తెరకెక్కుతోంది. చాప్టర్-1కు వివిధ భాషల్లో లభించిన ఆదరణ దృష్ట్యా సీక్వెల్ను నిర్మించే పనిలో చిత్రబృందం ఉంది. కాగా పీరియాడిక్ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీకి సంబంధించిన సన్నివేశాలున్నాయట. దాంతో ఆ పాత్రకు రవీనా అయితే న్యాయం చేకూరుస్తుందని, అంతేకాకుండా ఆమె నటించడం వల్ల బాలీవుడ్లో చిత్రాన్ని మార్కెట్ చేయడం కూడా సులువు అవుతుందని చిత్రబృందం భావించిందట. ప్రస్తుతం సెట్స్పై ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం