8 మంది మృతికి కారణమైన కువైటీ టీనేజ్ డ్రైవర్ అరెస్ట్
- May 29, 2019కువైట్: చిన్న రోడ్డు ప్రమాదం జరగడంతో, అక్కడ గుమికూడి బాధితులకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నవారిపైకి మరో వాహనం వేగంగా దూసుకురావడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కువైట్లో చోటు చేసుకున్న సంగతి తెల్సిందే. కబాద్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు గుర్తించి, 17 ఏళ్ళ కువైటీ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది చనిపోయగా అందులో ముగ్గురు కువైటీలు, ముగ్గురు సౌదీలు ఓ బెడౌన్ మరియు ఇద్దరు ఓ గుర్తు తెలియని వ్యక్తి వున్నారు. పలువురు గాయాల బారిన కూడా పడ్డారు. అరెస్ట్ చేసిన నిందితుడిపై చట్టపరమైన చర్యలు వుంటాయని అధికారులు తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డుపై ప్రజలు గుమి కూడడడం మంచిది కాదనీ, అదే సమయంలో రోడ్డుపై పరిమిత వేగంతో మాత్రమే వాహనాలు నడపాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం