మస్కట్లో అగ్ని ప్రమాదం: నాలుగు ట్రక్కుల ధ్వంసం
- June 15, 2019మస్కట్:మస్కట్ గవర్నరేట్ పరిధిలో జరిగిన అగ్ని ప్రమాదం నాలుగు ట్రక్కుల దహనానికి కారణమయ్యింది. పబ్లిక్ అతారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్సెస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫైర్ ఫైటర్స్, అగ్ని కీలల్ని నియంత్రించేందుకు ప్రయత్నించారనీ, అయితే అప్పటికే వాహనాలు కాలి బూడిదయ్యాయని అధికారులు వెల్లడించారు. బౌషర్లోని గలా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ సంస్థకు చెందిన నాలుగు ట్రక్కులు కాలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు