దుబాయ్ బస్ ప్రమాదం: డ్రైవర్కి ఏడేళ్ళ జైలు శిక్ష, 3.4 మిలియన్ దిర్హామ్ల బ్లడ్ మనీ జరీమానా?
- June 26, 2019దుబాయ్లో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి డ్రైవర్పై అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసులో డ్రైవర్కి ఏడేళ్ళ జైలు శిక్ష విధించాలనీ, అలాగే 3.4 మిలియన్ దిర్హామ్ల బ్లడ్ మనీ చెల్లించాల్సిందిగా ఆదేశించాలనీ ప్రాసిక్యూషన్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ కేసు విచారణ తాజాగా న్యాయస్థానంలో జరిగింది. ఈ సందర్బంగా 53 ఏళ్ళ ఒమనీ డ్రైవర్పై అభియోగాలు నమోదయ్యాయి, వాటిపై విచారణ జరిగింది. 31 మందిని తీసుకెళుతున్న బస్సు, జూన్ 6న రోడ్ హైట్ రిస్ట్రిక్షన్ బ్యారియర్ని అతి వేగంతో ఢీకొట్టింది. అల్ రష్దియా మెట్రో స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 31 మంది ప్రయాణీకుల్లో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 16 మంది గాయాలపాలయ్యారు. అందులో ఒకరు వైద్య చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో 12 మంది భారత జాతీయులు, ఇద్దరు పాకిస్తానీయులు, ఒకరు ఒమన్, మరొకరు ఫిలిప్పీన్కి చెందినవారున్నారు.
తాజా వార్తలు
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్