భారత్ పై భగ్గుమంటున్న ట్రంప్
- July 12, 2019భారత్-అమెరికా దేశాల మధ్య టారిఫ్ వార్ ఓ వైపు సాగుతుండగా..దీనికి ఆజ్యం పోస్తూ.. యుఎస్ లోని మల్టీనేషనల్ రిటెయిల్ కార్పొరేషన్..వాల్ మార్ట్… ఇండియామీద సరికొత్త ఆరోపణలు చేసింది.. ఈ-కామర్స్ కు సంబంధించి భారత నూతన పెట్టుబడి నిబంధనలు కఠినతరంగా ఉన్నాయని, తమ వాణిజ్య సంబంధాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయని అమెరికాకు ఫిర్యాదు చేసింది. ఈ సంస్థ గత జనవరిలోనే ఈ మేరకు ఫిర్యాదు చేసినప్పటికీ.. తాజాగా ఇందుకు సంబంధించిన డాక్యుమెంటును రాయిటర్స్ కు అందజేసింది. ఇండియా తన కొత్త టారిఫ్ నిబంధనలను ఫిబ్రవరి 1 నుంచి అమలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 28 వస్తువులపై సుంకాలను పెంచింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం భగ్గుమన్నారు. భారత చర్య తమను ఆందోళనకు గురి చేస్తోందని, ఈ-కామర్స్ రెగ్యులేషన్స్ అత్యంత హార్ష్ గా ఉన్నాయని వాల్ మార్ట్ పేర్కొంది. భారత-అమెరికా దేశాలమధ్య ఈ నిబంధనలు కీలకంగా మారిన విషయాన్ని ఈ సంస్థ గుర్తు చేసింది. గతంలో ఇది ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్ కార్ట్ పై 16 బిలియన్ యుఎస్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ఈ సొమ్ము వాల్డ్ లోనే ఒక సంస్థ మరొక దానిపై ఇన్వెస్ట్ చేసిన అత్యధికమైనదిగా పేర్కొంటున్నారు. రిటెయిల్ మార్కెట్లో వాల్ మార్ట్.. ఇండియాతో మంచి వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది. అయితే అమెరికన్ సరుకులపై భారత ప్రభుత్వం సుంకాలను పెంచడంతో దాని ప్రభావం ఈ సంస్థపై కూడా పడింది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం