మూడేళ్ళలో కువైట్ని వదిలి వెళ్ళిన 65,521 డొమెస్టిక్స్
- July 23, 2019కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం 65,521 మంది డొమెస్టిక్ వర్కర్స్ గత మూడేళ్ళలో కువైట్ని విడిచి వెళ్ళారు. తమ కాంట్రాక్టులు ముగియడంతో వీరు కువైట్ని వదిలినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. కాగా, 69,282 మంది డొమెస్టిక్ వర్కర్స్ని ఈ ఏడాది ఇప్పటిదాకా హైర్ చేసుకోవడం జరిగిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లో రిజిస్టర్ చేసుకున్న డొమెస్టిక్ వర్కర్స్ సంఖ్య 718,000కి చేరుకుంది. డిసెంబర్ 31 నాటి లెక్కలతో పోల్చితే, ఆరు నెలల్లో 9.6 శాతం పెరుగుదల నమోదయినట్లు అధికారులు వివరించారు. దేశంలో పనిచేస్తున్న వలసదారుల్లో డొమెస్టిక్ ఎంప్లాయ్మెంట్ శాతం 34.1గా వుంది. 21.1 మిలియన్ వలసదారులు దేశంలో పనిచేస్తున్నారు. గత మూడేళ్ళలో 2,500 మందిని డిపోర్ట్ చేయడం జరిగింది. స్వచ్ఛందంగా 2015-2017 మధ్య 21,000 మంది దేశం విడిచి వెళ్ళారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్